Wednesday, January 20, 2016

ఆత్మానుగతం
-----------------రావెల.


పాటలుపాడే పక్షులన్నీ
ప్రభాతవేళకుముందుగానే
చెట్ల చిటారుకొమ్మలమీదకుచేరి
ఒక సమావేశాన్ని నిర్వహించాయి.

సూర్యకిరణాలు భూమితల్లి
పాదాలను స్పృశించి పరవశించకమునుపే
ప్పొదోటలోని మొక్కలనీ పూల పరిమళాలను
పూర్తిగా వెదజల్లకముందే మనమెందుకు
ముదంస్తుగా లేచి ఈ ప్రబాతగీతాలు ఆలపించాలి?

కోడికూతలు మానేసి దశాబ్దాలుగడివిపోయాయి.
అలారంగడియారాలూ అరచి గీపెట్టడం మానేసాయి.
ఠాణాల్లో గంటలుకొడతారన్న వుషయమే మరచిపోయారు.
ఇక మనమేగదా ఈ బుద్ధిజీవులకు తోడుగానిలిచి
మేల్కొల్పుగీతాలుపాడుతూ వారందరినీ జాగృతంచేయాలి.
అందుకేమనమంతా విరామమెరుగని విహంగాలమై
మనపనిని మనం హృదయపూర్వకంగా నిర్వహించాలి!!

నిద్రాణమైపోతున్న జాతికి
జాగృతగీతాలనాలపించి జాగ్రత్తపరచాలి!!
నింగికీ నేలకూమధ్యనవారధిలా ప్రవర్తించాలి!!
మనపని మనం చేసుకుంటూ పోతుంటేనేగద
పరమాత్ముడి కృపాకటాక్ష వీక్షణాలకు
పాత్రులమై జీవితాలను ధన్యంచేసుకోగలిగేది.
అందుకని ఏతావాతా మొత్తమ్మీద మనకొచ్చిన
 విద్య ఇదేగనుక విచక్షణాజ్ఞానంతో
కర్తవ్యదీక్షతో ఈ కార్యక్రమాన్ని మనం
 క్రమం తప్పక నిర్వహించగలగాలి.
విజయం దిశగా దూసుకెళ్ళామన్న తృప్తితో జీవించాలి.
==========================

No comments:

Post a Comment