Thursday, December 10, 2015

నిన్నటికీ నేటికీ మధ్యన
ఎంత వ్యత్యాసం
వ్యవధానం తక్కువేకావచ్చు
కాని జరిగిందంతా
కాలయాపనకాని అవధానం.

మనిషికీ మనసుకూ నడిమయాన
వంతెనలా కలుపుతూ సాగి  పోతున్న ప్రయాణం.
కష్టశుఖాలమధ్యన కన్నీటిజాలేగదా
మానవమాత్రుడి జీవన యానం.
ఒంటరితనం ఒక్కసారిగా
ఆలింగనంచేసుకుంటే
ఒదిగి ఒదిగి పోవాలనిచెప్పేదేగదా
వేద విహితమై విలసిల్లే శాస్త్రసమ్మతమౌ సత్యం.

-------------------------------

No comments:

Post a Comment