Monday, November 9, 2015


ఎగసాయం-----------రావెల పురుషోత్తమరావు.================================= ఊరు ఊరంతా బందెల దొడ్డిగా మారింది మృత్యు గహ్వరానికీ దీనికే భలేగా సామ్యం కుదిరింది. తెల్లబంగారమని పండిస్తేతెల్లటి వస్త్రమై మనిషిని కప్పేసింది. మిర్చి బాగుందనుకుంటేఆ దిగుబడి తగ్గిపోయిఘాటుగా గుండెకు తగిలింది. వరిపంట గదాని నారునాటి నీరుపోస్తేపొట్తకొచ్చిన కంకులను మిడతలునమిలేసాయి. చెరకు తీపిని తలచుకునిఎకరాలను సాగుచేస్తేఅదికాస్తా చేదువిషమైకుటుంబాన్ని రోడ్డున పడేసింది. భీమా వస్తుందని కిస్తీలుకడితేసొమ్ములుకాస్తా స్వాహా చేయబడింది. అమ్మయి పెళ్ళి అబ్బాయి చదువుఇప్పుడిలా ప్రశ్నార్ధకమై మిగిలింది. ఆశించిన పురుగును చంపలేని సం హారక మందుమనుషులను చంపడంలో మొదటిస్థానానికెదిగింది. పొలం గట్లమీద పిట్టల్లా రాలిపడుతున్న శవాగారంరాజకీయానికి రాబందులా సహకరించింది. చేతగాని నేతల వాగ్దానాలకొలిమిలో
రైతాంగం బ్రదుకు మాడి మసై బూడిదగా చివరకు మిగిలింది. వ్యవసాయం ఆధునికంగా వ్యధార్త జీవితపు యదార్ధ దృశ్యమై హృదయమంతటినీ కలచివేసింది. =============================

No comments:

Post a Comment