Wednesday, October 21, 2015

మనిషికీ మనిషికీ మధ్యన
నిర్మితమై నికార్సుగా నిలబడ్డ
వంతెనను ఎవరో కుదిపేసి కూల్చేస్తున్నారు?

కాలంతో పాటుపరుగెడుతూ   కాగితాలు ఖరాబుచేస్తున్న వాడిని
కత్తులతో పొడిచేసి కరాఖండీ గా  హతమారుస్తున్నారు.

వాగ్దానాలన్నింటినీ మూడుసిం హాల సిం హసనాధీశులు
మూడుచెరువుల నీటిని త్రాగించి ముప్పతిప్పలుపెట్టిస్తున్నారు.

న్యాయానికీ ధర్మానికీ మధ్యన మూర్ఖపు శిఖామణులు
తిష్ఠవేసుకు కూర్చొని  నడమంత్రపు సిరులనే ఎండమావుల వెంట
దాహార్తిని తీర్చుకోవాలని నిష్ఫల ప్రయత్నాలు కొన సాగిస్తున్నారు.
=======================================

No comments:

Post a Comment