శ్రీరంగం శ్రీనివాసు
రాసి మహాప్రస్థానం
తెచ్చుకునె కవిత్వాన
ప్రధమ గణ్య స్థానం.
ఈ శతాబ్దం నాదంటూ
జబ్బలు చరిచినవాడు,
అధోజగత్సహోదరుల వెంటే
నేనంటూ కలివిడిగా తిరిగినోడు.
మనసునమనసై బ్రతకడమే
గొప్పని చెప్పినవాడు.
అగాధమౌ జలనిధిలో
ఆణిముత్యమున్నదని
గ్రహించినవాడు..
శోకాలమరుగునదాగిన
సుఖాన్ని వెదికినవాడు.
రేపటి కాలంలో జరిగే నిత్య సత్యాలను
కళ్ళకు కట్టినట్లుగా వివరించిన క్రాంతదర్శి.
అవినీతి బంధుప్రీతి అలముకున్న ఈదేశం
ఎటుదిగజారునోయని బాధపడిన భారతీయు డు. .
రాసి మహాప్రస్థానం
తెచ్చుకునె కవిత్వాన
ప్రధమ గణ్య స్థానం.
ఈ శతాబ్దం నాదంటూ
జబ్బలు చరిచినవాడు,
అధోజగత్సహోదరుల వెంటే
నేనంటూ కలివిడిగా తిరిగినోడు.
మనసునమనసై బ్రతకడమే
గొప్పని చెప్పినవాడు.
అగాధమౌ జలనిధిలో
ఆణిముత్యమున్నదని
గ్రహించినవాడు..
శోకాలమరుగునదాగిన
సుఖాన్ని వెదికినవాడు.
రేపటి కాలంలో జరిగే నిత్య సత్యాలను
కళ్ళకు కట్టినట్లుగా వివరించిన క్రాంతదర్శి.
అవినీతి బంధుప్రీతి అలముకున్న ఈదేశం
ఎటుదిగజారునోయని బాధపడిన భారతీయు డు. .
No comments:
Post a Comment